ఈ video లో మనం 276 పాడల్ petra స్థలాల్లో 21 వ శైవక్షేత్రం మైన శ్రీ తిరువల్లేశ్వర్ ఆలయాన్ని చూద్దాము. ఈ ఆలయము చెన్నై సమీపములోని తిరువాలిదయం ప్రాంతంలో కలదు. ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం పాడి అని కూడా పిలుస్తారు. వినాయకస్వామి కి సిద్ధి,బుద్ధి మాతలతో వివాహం జరిగిన ప్రాంతం ఇది. తిరుజ్ఞాన సంబంధర్ నాయనార్ యొక్క శ్లోకాలతో ఈ ఆలయం గౌరవించబడినది. ఈ ఆలయము లోని మహాశివుడిని శ్రీ వాలితాయనాథర్ లేక శ్రీ వల్లీశ్వర్ అని,పార్వతి మాతను శ్రీ జగదాంబల్ లేక శ్రీ తాయమ్మాయి అని పిలుస్తారు. ఆలయ కొనేరుని బరధ్వాజ తీర్ధం అంటారు.