ఈ video లో మనం 276 పాడల్ పెట్ర స్థలాల్లో 11 వ శైవక్షేత్రం అయిన తిరుమాల్పూర్ లోని శ్రీ మణిఖండేశ్వర ఆలయాన్ని చూద్దాము. ఈ ప్రాంతంలో మహావిష్ణువు పరమశివుడిని మెప్పించి సుదర్శన చక్రాన్ని పొందారు. ఈ ఆలయము తమిలనాడు రాష్ట్రం లోని కాంచీపురం పట్టణానికి 14 km దూరంలో తిరుపతి మార్గంలో కలదు. తిరుజ్ఞాన సంబంధర్ నాయనర్, అప్పర్ నాయనర్ ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడింది. ఈ ఆలయము లోని మహాశివుడిని శ్రీ మణి ఖండేశ్వర్, శ్రీ దయానీతీశ్వర్, శ్రీ మాళ్వనంగియ ఈశ్వర్,శ్రీ అంజనక్షి అని వివిధ పేర్లతో పిలుస్తారు. అలాగే పార్వతి మాతను శ్రీ అంజనాక్షి అమ్మవారు, శ్రీ కరునై నాయకి అని పిలుస్తారు. ఆలయకొనేరుని చక్ర తీర్ధం అని పిలుస్తారు.