ఈ video లో మనం దక్షిణ భారతదేశ రాష్ట్రమైన తమిళనాడు లోని తిరునెల్వేలి నగరానికి సుమారు 32 km దూరంలో గల NANGUNERI పట్టణములోని వనమామలై పెరుమాళ్ ఆలయాన్ని చూస్తాము. విష్ణువునకు అంకితం చేయబడిన ఈ ఆలయము ఆళ్వార్ ల యొక్క పవిత్ర శ్లోకాలతో కీర్తించబడి 108 వైష్ణవ దివ్యదేశాలలో 79 వ దివ్యదేశం గా గుర్తింపు పొందినది. ఈ ఆలయము లోని మహావిష్ణువు ని వనమామలై పెరుమాళ్ మరియు తొతాత్రి నాథర్ అని,లక్షీదేవిని వరమంగై తాయారు అని పిలుస్తారు. ఈ ఆలయ గర్భగుడిలో మహావిష్ణువు శ్రీదేవి మరియు భూదేవి సమేతంగా సింహాసనం పై కూర్చున్న భంగిమలో దర్శన మిస్తున్నారు. ఈ ఆలయ విమానాన్ని నందివర్ధన విమానమని,ఈ ఆలయ కొనేరుని chetruthamari తీర్థం అని పిలుస్తున్నారు. ఈ ఆలయము మహావిష్ణువు యొక్క అష్ట స్వయంవ్యక్త క్షేత్రాలలో ఒకటి. అంతర్గత బాహ్య వ్యాధులను నయం చేసే సర్వరోగ నివారనిగా పిలవబడే నూనె గల బావి ఈ ఆలయములో కలదు.