AMPM Live : పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణపై వైసీపీ నాయకుడు అదీప్ రాజు ఘాటైన వ్యాఖ్యలు చేసారు. తమ పార్టీ నాయకులపై లేనిపోని అబాండాలు వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జెర్రిపోతులపాలెంలో ఒక మహిళపై కొందరు వ్యక్తులు చేసిన దాడిలో బండారు అనుచరులదే ప్రధానపాత్ర అని ఆరోపించారు. సంఘటన జరిగే ముందు వరకూ బండారు తనయుడు అప్పలనాయుడు అక్కడే ఉన్నారని, అవసరమైతే ఆధారాలతో నిరూపిస్తామన్నారు. అక్కడి భూములను కేవలం టీడీపీ నాయకులకు కట్టబెట్టి బండారు కబ్జా చేసే ప్రయత్నం చేసారని, తిరిగి వైసీపీ నాయకులపై నెపం నెడుతున్నారని అదీప్ రాజు ఆగ్రహించారు. పెందుర్తి ఎమ్మెల్యే అంటే బూతులు మాట్లాడేవాడని ప్రజలు అనుకుంటున్నారని.. ఇకనైనా బండారు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ~-~~-~~~-~~-~ Please watch: "AMPM Live News Roundup || 24-08-2019 || Bulletin" • AMPM Live News Roundup || 24-08-2019 || Bu... ~-~~-~~~-~~-~