జలదిగ్బంధంలో నెల్లూరులోని అనేక ప్రాంతాలు కొనసాగుతున్న పేనా వరద ఉధృతి ---------------------------------------------------------------- నెల్లూరు నగరంలో పెన్నా నది ఉధృతి తీవ్రంగా ఉంది. ఇప్పటికే అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా వారిని పునరావాస కేంద్రాలకు తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే అక్కడి ఇళ్లు దాదాపు నీటిలో మునిగిపోయాయి. వరద తీవ్రత తగ్గిన తరువాత ఆ ఇంటికి ఎలా వెళ్లాలని వరద బాధితులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా పెన్నానది ఉధృతిని చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలి వెళ్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిన్ను క్రమబద్ధీకరిస్తున్నారు. పలు చోట్ల హైవేపైకి నీరు రావడంతో ప్రవాహం మీదుగానే వాహనాల రాకపోకలను కొనసాగిస్తున్నారు. #Nellore #AP #PennaOverflow