#bhakti #ttd3 #tirumalatirupati #tirupatibalaji #lordvenkateswara #lordbalaji #devotional #spiritualjourney @psrtimes ఆల్ టైమ్ రికార్డ్ తిరుమల వైకుంఠ ద్వార దర్శనం | Vykunta Ekadasi Darshan | PSR Times తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తుల్లో విశేష సంతృప్తి 10 రోజుల్లో 7.83 లక్షల మందికి శ్రీవారి దర్శనాలు గత వైకుంఠ ద్వార దర్శనాలతో పోల్చితే ఈసారి లక్ష మంది భక్తులకు అధికంగా దర్శనం రూ.41.14 కోట్ల హుండీ ఆదాయం 33 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ 44 లక్షల లడ్డూల విక్రయం డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ చేసిన ఏర్పాట్లపై భక్తులు విశేష సంతృప్తి వ్యక్తం చేసినట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు తెలియజేశారు. వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం కావడంతో ఆయన టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలతో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శుక్రవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలోని ముఖ్యాంశాలుః స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏఐ సహకారంతో ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని పర్యవేక్షిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా టోకెన్ లేని భక్తులకు కూడా వేగవంతంగా దర్శనం. వైకుంఠ ద్వార దర్శనాలపై దాదాపు 93 శాతం మంది భక్తులు సంతృప్తి. శ్రీవారి ఆలయం ఈ పది రోజుల్లో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 7.83 లక్షలు. గత వైకుంఠ ద్వార దర్శనాల్లో 6.83 లక్షల మంది దర్శించుకోగా ఈ ఏడాది లక్ష మంది భక్తులకు అదనంగా దర్శనాలు. జనవరి 2వ తేది శుక్రవారం రోజు అయినప్పటికీ రికార్డుస్థాయిలో 83 వేల మంది భక్తులకు దర్శనం. జనవరి 3వ తేది శనివారం అత్యధికంగా దాదాపు 89 వేల మందికి దర్శనం. అందుబాటులో ఉన్న 182 గంటల దర్శన సమయంలో 164 గంటల సమయం సామాన్య భక్తులకు కేటాయించడంతో సామాన్య భక్తుల్లో ఆనందం. ఈ పది రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.41.14 కోట్లు. భక్తులకు విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య - 44 లక్షలు గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 10 లక్షల లడ్డూలు అదనంగా విక్రయం. భద్రత : దాదాపు 2400 మంది పోలీసులు, 1150 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు. వివిధ విభాగాల సమన్వయంతో ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు. ఇంజినీరింగ్ : తిరుమల, తిరుపతిలో 5 భాషల్లో భక్తులకు అర్థమయ్యేలా 400 ప్రచార బోర్డులు ఏర్పాటు. రేడియో బ్రాడ్ కాస్టింగ్ ద్వారా 5 భాషల్లో వైకుంఠ ద్వార దర్శనాలపై అవగాహన. తిరుమలలో విద్యుత్ దీపాలంకరణపై భక్తులు విశేష ప్రశంస. తిరుమలలో టీటీడీ విజిలెన్స్, పోలీసులు సమన్వయంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా బ్యారికేడ్లు ఏర్పాటు. తిరుమలలో నీటి కొరత లేకుండా నిరంతరాయం భక్తులకు నీటి సరఫరా. అన్న ప్రసాదం : ఈ పది రోజుల్లో 33 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీ. గత వైకుంఠ ద్వార దర్శనాలతో పోల్చితే ఈసారి 9.29 లక్షల మంది భక్తులకు అదనంగా అన్న ప్రసాదాలు పంపిణీ. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూలైన్లలో నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది దాదాపు 39 శాతం అధికంగా అన్న ప్రసాదాలు పంపిణీ. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి వేడి బాదం పాలు సరఫరా. దాదాపు 1000 మంది అన్న ప్రసాదం సిబ్బందితో విజయవంతంగా ఎప్పటికప్పుడు అన్న ప్రసాదాలు తయారు చేసి పంపిణీ చేయడంతో భక్తులల్లో సంతృప్తి. ఉద్యానవనం : శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు 50 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల ఫలాలు, 4 టన్నుల కట్ ఫ్లవర్స్ తో ఏర్పాటు చేసిన అలంకరణలు వైకుంఠాన్ని తలపించాయని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. కల్యాణకట్ట: ఈ పది రోజుల్లో 2.06 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పణ. తలనీలాల సమర్పణకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సౌకర్యవంతం ఏర్పాట్లు. గతంలో కంటే ప్రస్తుతం తలనీలాల సమర్పణ సులువుగా సౌకర్యవంతంగా ఉందని చాలా మంది భక్తులు తెలియజేశారు. ఆరోగ్య విభాగం 24 గంటలు దర్శన క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్లలో అందుబాటులో ఉంచిన మొబైల్ డిస్పెన్సరీల ద్వారా అవసరమైన భక్తులకు వైద్యం. ఈ సందర్భంగా టీటీడీ యంత్రాంగం తో సమన్వయం చేసుకుని చక్కటి సేవలు అందించిన పోలీస్ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, ఏపీఎస్ ఆర్టీసీ, శ్రీవారి సేవకులు, ఇతర విభాగాలు, మీడియా ప్రతినిధులకు చైర్మన్ ధన్యవాదాలు తెలియజేశారు. టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ తిరుమలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా గతంలో కంటే అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారని చెప్పారు. గత వైకుంఠ ఏకాదశి రోజు 7 లక్షలకు పైగా దర్శించుకుంటే ఈసారి 12 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. టీటీడీ భక్తుల కోసం చేస్తున్న సౌకర్యాలను చూసి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారని చెప్పారు. అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ వివిధ విభాగాల మధ్య సమన్వయంతో సమయాన్ని సరైన విధంగా వినియోగించుకోవడంతో అనుకున్న దానికన్నా అదనంగా దర్శన సమయం సమకూరడంతో మరింత మంది భక్తులకు సౌకర్యవంతంగా దర్శనం చేయించేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు.