మధిరలో మోటారు సైకిళ్ల ప్రదర్శన అంగడాల గోపీనాధ్, మధిర రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ -------------------------------------------------------------- జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా మధిరలో పోలీసులు మోటారు సైకిళ్లతో ప్రదర్శన నిర్వహించారు. పట్టణ పురవీధుల గుండా కొనసాగిన ఈ ప్రదర్శన వాహన దారుల్లో అవగాహాన పెంచింది. ఈ సందర్బంగా మధిర CI శ్రీధర్ మాట్లాడారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. తద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చునని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ SI తిరుపతిరెడ్డి, గ్రామీణ SI B.కిషోర్ తదితరులు పాల్గొన్నారు.