MP Kalvakuntla Kavitha Exlusive Interview

MP Kalvakuntla Kavitha Exlusive Interview

తెలంగాణ రాష్ట్ర సమితి లాంటి ప్రాంతీయ పార్టీలు ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాయని టీఆర్‌ఎస్ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత బీబీసీ తెలుగు ప్రతినిధి దీప్తి బత్తినికి సోమవారం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ (సమాఖ్య కూటమి) విషయమై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డితో టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు చర్చించారని కవిత ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎవరు విజయం సాధిస్తారనేది పక్కనబెడితే, టీఆర్‌ఎస్‌కు ఆంధ్రప్రదేశ్‌ కూడా దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరే ఒక రాష్ట్రమని ఆమె తెలిపారు.