OXY ( ) కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తున్న వేళ............ ఆక్సిజన్ కొరతతో సతమతం అవుతున్న భారత్ కు అమెరికా అండగా నిలిచింది. దాదాపు........... 300 వరకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను భారత్ కు తరలిస్తోంది. ఇవి........... 5 టన్నుల ఆక్సిజన్ అందించగలవు. న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెన్నడీ నుంచి ఈ కాన్సన్ ట్రేటర్లతో.. ఎయిర్ ఇండియా కార్గో విమానం A-102 భారత్ కు బయలుదేరింది. దాదాపు 15 గంటలపాటు............. నిర్విరామ ప్రయాణం తర్వాత ఈ మధ్యాహ్నంలోగా... దిల్లీలో కార్గో విమానం ల్యాండ్ అవుతుంది. వీటితో పాటు మరికొన్ని ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మెడికల్ ఉపకరణాలతో సాన్ ఫ్రాన్సిస్ కో నుంచి కూడా భారత్ కు విమానాలు వస్తున్నాయి. తదుపరి విమానం ఏప్రిల్ 27న భారత్ కు బయలుదేరనుంది. అమెరికాలోని భారత రాయబార కార్యాలయాలకు, ఎయిర్ ఇండియాకు దాతలు ఫోన్ చేసి.. భారత్ కు అవసరమైన వస్తువులు పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారని అధికారులు తెలిపారు. #LatestNews #EtvTelangana