మోదీ సర్కార్ తీసుకొచ్చిన టీకా విధానం వల్ల వ్యాక్సిన్ తయారీ సంస్థలకు....... లక్షా 11వేల కోట్ల లాభం చేకూరనుందని..కాంగ్రెస్ ఆరోపించింది. పేద ప్రజలకు టీకా ఉచితంగా అందించాల్సిన బాధ్యతను కేంద్రం విస్మరించిందని...... కాంగ్రెస్ నేత రణ్ దీప్ సుర్జేవాలా విమర్శించారు. వ్యాక్సినేషన్ అనేది ప్రచార కార్యక్రమం కాదన్న ఆయన..ప్రపంచంలోనే అత్యంత వివక్షపూరితమైన టీకా విధానాన్ని మోదీ సర్కార్ ప్రవేశపెట్టిందని మండిపడ్డారు. మరోవైపు కరోనా మరణాలను కేంద్రం దాచాలని చూస్తోందని...కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆక్సిజన్ కొరతను ప్రభుత్వం అంగీకరించడం లేదన్న రాహుల్...ఈ మేరకు ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని.. తన ట్వీట్టర్ పోస్టుకు జత చేశారు. #LatestNews #EtvTelangana